Read Time:5 Minute, 57 Second
పరిపాలన విధానం
- వీరి పాలనలో రాజుకు సర్వాధికారాలు కలవు.(rashtrakuta-empire-2)((Rashtrakuta Empire)
- రాష్ట్రకూట సామ్రాజ్యంలో కొంతభాగం చక్రవర్తి ప్రత్యక్ష పాలనలో, మరికొంత భాగం సామంతరాజుల ఆధీనం లో ఉండేది.
- సామంతరాజులు చక్రవర్తియొక్క ఆజ్ఞలను పాటించి అతనికి కప్పం చెల్లిస్తుండేవారు.
- రాజ్యం-రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించి పాలన చేశారు.
1. రాజ్యం-రాష్ట్రాలు
2. రాష్ట్రాలు- రాష్ట్రపతి / మహాసామంత / మహామండళేశ్వర
3. విషయము-విషయపతి/భోగపతి
4. గ్రామము-గ్రామాధికారి - ఆ విషయపతి, భోగపతి అనే అధికారులు రెవెన్యూ పాలనను “దేశగ్రామకూట” అనే రెవెన్యూ అధికారుల సహాయంతో నిర్వహించేవారు.
- పంటలో 1/4వ వంతు పన్నుగా విధించేవారు.
- రాష్ట్రకూటుల ఆదాయంలో అధిక భాగం సామంతరాజులు చెల్లించిన కప్పం నుండే వచ్చేది.
- భూమిశిస్తును భాగ, కర అని పిలిచేవారు.
- అనావృష్టి పరిస్థితులలో పన్నుల మినహాయింపు ఉండేది.
మతం
- రాష్ట్రకూటుల కాలంలో హిందూ, బౌద్ధ,జైన మతాలు ఉన్నప్పటికి బౌద్ధం మాత్రం పతనావస్తలో ఉంది.
- వీరి కాలంలో జైనమతం మహోన్నత స్థితిలో ఉంది.
- ఈ కాలంలో హిందువులు శివ, విష్ణు, లక్ష్మి, సూర్యుడిని ఆరాధించేవారు.
- దేవాలయాల్లో దేవదాసీలు దైవారాధన సమయంలో నృత్యం చేసేవారు.
- విద్యాభ్యాసం కొరకు దేవాలయాలకు అనుబంధంగా పాఠశాలలు నిర్మించారు.
- అగ్రహారాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా రూపొందాయి.
- రాజ్యంలో ఉన్న ముఖ్యనగరాలు, పుణ్యక్షేత్రాలు కూడా విద్యాకేంద్రాలుగా వర్ధిల్లాయి.
- వీరు ముస్లింలకు తమ రాజ్యంలో మసీదులు నిర్మించుకొనుటకు అనుమతులిచ్చారు.
సామాజిక-ఆర్థిక అంశాలు:
- సమాజంలో నిమ్నకులాల పరిస్థితి మెరుగైంది.
- సతి ఆచారం అంతగా ప్రచారంలో లేదు.
- బాల్యవివాహాలు ఉన్నాయి. కానీ వితంతు వివాహాలు లేవు.
- వీరి రాజ్యంలో ప్రధాన పంటలు-వరి,జొన్న, పత్తి,
- వస్త్రపరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. గుజరాత్, బీరార్, తెలంగాణాలు ఈ పరిశ్రమకు ముఖ్య కేంద్రాలు.
- దేశంలో తయారైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు.
- అరబ్బులతో వ్యాపారాన్ని ప్రోత్సహించారు.
శిల్పకళ:
- ముంబాయి నమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు రాష్ట్రకూటుల (rashtrakuta-empire)కాలం నాటివి.
- ఇవి ఎలిఫెంటా ద్వీపం లేదా ఘరపురి (The City of Caves)లో ఉన్నాయి.
- వీటిని 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.
- నల్లరాయితో చెక్కిన ఏనుగు శిల్పం ప్రస్తుతం ‘జిజమాతా ఉద్యాను (ముంబాయి) తరలించడం జరిగింది.
- ఏలిఫెంటా గుహాలయంలోని ప్రఖ్యాత శిల్పం – త్రిమూర్తి శిల్పం
- భారతీయ శిల్పకళారంగంలో ఎనలేని పేరుగాంచినది రాష్ట్రకూటుల యొక్క ఏకశిలా వాస్తు నిర్మాణం,
- ఎల్లోరాలోని దశావతార గుహాలయం – 15వ గుహలో ఉన్నది. దీనిని దంతిదుర్గుడు నిర్మించాడు.
- వీరి అత్యున్నత వాస్తుశైలికి నిదర్శనం – ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం
- పశ్చిమ చాళుక్యుల కాలంలో మొదలైన వెసారశైలి వీరి కాలంనాటికి అత్యున్నత స్థితికి చేరుకుంది. ‘
ఎల్లోరా గుహలు:
- ఇది ఔరంగాబాద్ (మహారాష్ట్ర)కు సమీపంలో ఉన్నాయి.
- నిర్మించినది- రాష్ట్రకూటులు
- ఇవి బౌద్ధ, జైన, హిందూ మతాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నాయి.
సాహిత్యం:
- వీరి రాజభాష – సంస్కృతం
- వీరి కాలంలో అభివృద్ధి చెందిన భాషలు – కన్నడం
- కన్నడ కవిత్రయం – 1 )పంప-కన్నడ ఆదికవి, 2 )పొన్న ,3 )రన్న
- పంప : కన్నడ ఆదికవి రాష్ట్రకూటుల సామంతుడైన వేములవాడచాళుక్యూల పోషణ నుఅందుకున్నాడు.
- ఇతని రచనలు :1. ఆదిపురాణం,2. విక్రమార్జున విజయం.
- పొన్న:3వ కృష్ణుని ఆస్థానంలో ఉండేవాడు
- రచనలు : శాంతిపురాణం
- రన్న రచనలు :1. అజిత పురాణం, 2. గదాయుద్ధం.
అమోఘవర్షుని సాహిత్యం :
- ఇతని రచనలు:
1) కవిరాజమార్గ-కన్నడ భాషలో మొదటి అలంకార గ్రంథం,
2) ప్రశ్నోత్తర రత్నమాళిక,
3) నీతికావ్యం - ఇతని కాలంలో జైనమత కవులు: 1) గణితయానవీర ఆచార్య-గణితసార సంగ్రహ,
2) శాత్తాయన-అమోఘవృత్తి
హరిసేనుడు :
- ఇతను అమోఘవర్షుని ఆస్థానకవి
- ఇతని గ్రంథం – హరివంశం
- ఇతడు ఆదిపురాణంలో కొంతభాగం రచించాడు.
Rashtrakuta Empire రాష్ట్రకూటులు(క్రీ.శ.752-997)
Average Rating